రామ్ చరణ్ నిర్మాతగా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అప్డేట్

by Disha Web Desk 7 |
రామ్ చరణ్ నిర్మాతగా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త ప్రొడక్షన్ బ్యానర్‌ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. చర్రీ, ప్రొడ్యుసర్ విక్రమ్ రెడ్డి కలిసి ‘V MegaPictures’ అనే బ్యానర్‌ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘V MegaPictures’ నుంచి ఈరోజు మొదటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశారు. ఈ సాలిడ్ ప్రాజెక్ట్‌లో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటించనుండగా కొత్త డైరెక్టర్ రామ్ వంశీ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌ను ఇచ్చారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌తో నిఖిల్ హరోగా ‘ది ఇండియా హౌస్’ సినిమాను తీస్తున్నట్లు తెలిపారు. కాగా ఇందులో అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు.



Next Story

Most Viewed